ములుగు : జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతున్నది. వెంకటాపూర్ మండలం రామకృష్ణాపురం గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం పులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. రెండు రోజులుగా ములుగు మండలం రాయినిగూడెం దేవునిగుట్ట పరిసర ప్రాంతాల్లో తిరిగింది.
కాగా పులి జాతీయ రహదారి 163 ను దాటి అటవీ మార్గం ద్వారా ఇక్కడికి చేరి ఉంటుందని ఆయా గ్రామస్తుల భావిస్తున్నారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | ఆ సొమ్మును అల్లుడే కాజేశాడట..
గుజరాత్ తీరంలో గల్లంతైన 15 మత్సకారుల పడవలు
Yadadri Temple | యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు