యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయంలోని కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు.
ముందుగా ఆలయ కల్యాణ మండపంలో 108 కలశాలకు పూజలు జరిపారు. స్వామివారి నిత్యపూజోత్సవాలు ఉదయం 4 గంటలకే ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవారికి నిజాభిషేకంతో పూజలను ప్రారంభించారు.
అనంతరం బాలలయంలో ఆస్థాన మండపంలో స్వామి వారి సుదర్శన నారసింహ హోమం జరిపారు. స్వామి అమ్మవార్ల నిత్య తిరు కల్యాణమహోత్సవంలో భక్తులు పాల్గొని కల్యాణ ఘట్టాన్ని తిలకించారు. స్వామి వారి దర్శనాలు నిరాటంకంగా సాగాయి.
ఇవి కూడా చదవండి..
రాజ్యసభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్
గుజరాత్ తీరంలో గల్లంతైన 15 మత్సకారుల పడవలు
24 గంటలే.. కేంద్రం, ఆప్ సర్కార్కు సుప్రీం అల్టిమేటం