హైదరాబాద్ : ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్ నగర్లో భారీ చోరీ కేసు దర్యాప్తులో కొత్త కోణం వెలుగు చూసింది. దుండగులు 90 తులాల బంగారు వడ్డాణం, 20 తులాల లాంగ్ చైన్, నాలుగు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు ఇంటి యజమానురాలు రంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిని విషయం తెలిసిందే.
పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టగా విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో ఉన్న అల్లుడే దొంగతనం చేసినట్టు విచారణలో తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగితా బంగారం కోసం విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాజ్యసభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్
గుజరాత్ తీరంలో గల్లంతైన 15 మత్సకారుల పడవలు
Yadadri Temple | యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు