ఖమ్మం : బీజేపీ నుంచి పలువురు నాయకులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ఖమ్మం నగర అధక్షుడు కమర్తపు మురళి ఆధ్వర్యంలో బీజేపీ వన్టౌన్ ఉపాధ్యక్షుడు మామిడి సతీశ్తో పలువురు నాయకులు..రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు.
నగరంలోని వీడీవోస్ కాలనీలోగల మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో బీజేపీ నేతలకు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు.
రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో బీజేపీ నాయకులు బూర్గుల రవికుమార్, రేగల్ల నాగరాజు, గుడ్ల శ్రీధర్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..