యాదాద్రి భువనగిరి : జిల్లాలోని వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామిని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్య్సగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.