హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగిరింది. వరుసగా రెండోసారి వరంగల్ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు ఓరుగల్లు ఓటర్లు. గులాబీ జెండాను గుండెలను హత్తుకున్న గ్రేటర్ వరంగల్ ఓటర్లు అద్భుతమైన తీర్పును ఇచ్చారు. వరంగల్ నగర అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్పై మరోసారి వరంగల్ ప్రజలు తమ ప్రేమను చాటుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను పట్టించుకోకుండా.. అభివృద్ధి వైపే అడుగులేసి అఖండ విజయాన్ని అందించారు ఓరుగల్లు ఓటర్లు.
టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఓరుగల్లు ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. స్వీట్లు పంచుకుని, సంతోషంలో మునిగిపోయారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే పార్టీ అభ్యర్థుల విజయానికి కారణమయ్యాయని వారు పేర్కొన్నారు.
మొత్తం 66 డివిజన్లకు తాజాగా ఎన్నికలు జరగ్గా.. ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. రాత్రి 7 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ 43 డివిజన్లలో గెలిచింది. బీజేపీ 10 డివిజన్లలో, కాంగ్రెస్ – 3, ఇతరులు – 5 స్థానాల్లో గెలిచారు. మరో ఐదు డివిజన్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఇక సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..