హైదరాబాద్ : సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. భారతీయ జనతా పార్టీ అయితే ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒక్క వార్డుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేదు. గులాబీ అభ్యర్థులు మంచి మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 43 వార్డులు ఉండగా, టీఆర్ఎస్ పార్టీ 36 వార్డుల్లో విజయం సాధించింది.
అచ్చంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ – 6, బీజేపీ -1 వార్డులో మాత్రమే గెలిచింది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ – 2, బీజేపీ -2 వార్డుల్లో గెలిచింది. కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ ఖాతానే తెరవలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం నకిరేకల్ లో 2 వార్డుల్లో, కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఐదు వార్డుల్లో గెలుపొందింది.
ఇవి కూడా చదవండి..