హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల పరిధిలోని దేవరయంజాల్ దేవాలయ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈటల రాజేందర్, ఇతరులు భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులపై కమిటీ ఏర్పడింది. సీతారామ స్వామి భూములు ఆక్రమణ చేశారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. నల్లగొండ, మంచిర్యాల, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు కమిటీలో ఉన్నారు. ఎంత భూమి ఆక్రమించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఐఏఎస్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..