MLA Sanjay | రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ర్యాంకింగ్-2026లో తెలంగాణ 13వ స్థానానికి పడిపోయిందని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తొమ్మిదినరేళ్లలో ఏ రోజు కూడా 3వ స్థానం నుంచి కిందికి దిగలేదు. ఏనాడు కూడా 1, 2, 3వ స్థానాల్లో ఉండేదన్నారు.
మన ప్లాన్ను, మన పాలసీని ఆంధ్రప్రదేశ్ ఎట్లాకాపీ కొట్టిందంటే ఆఖరి మనం రాసినవన్నీ కూడా ఆ రోజు కాపీ కొట్టేసింది. మనకు అంత బ్రహ్మాండమైన పాలసీ, ప్లాన్ ఉందన్నారు ఎమ్మెల్యే సంజయ్. అంత బ్రహ్మాండంగా నడిపించిన రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 13వ స్థానంలో నిలిచింది. దీని వల్ల వ్యాపారస్థులంతా పారిపోతున్నారు. కొత్తగా వ్యాపారేమీ రావడం లేదు. కొత్త ఇండస్ట్రీస్ ఏం రావు. నీతి ఆయోగ్ మొన్న కూడా మళ్లీ టీఎస్ ఐపాస్ అంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఎక్కడా లేదని మళ్లీ పొగిడింది. టీఎస్ ఐపాస్ ఉన్నా కూడా మనం 13వ స్థానంలో ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించాలన్నారు.
దేశంలోని వ్యాపారవేత్తలే కాదు.. ఆ రోజు ప్రపంచంలోని అందరు వ్యాపారవేత్తలు కూడా ఇంత బ్రహ్మాండమైన సింగిల్ విండో క్లియరెన్స్ పాలసీని మేమెక్కడా చూడలేదు. 15 రోజుల్లో మీకు అనుమతి వచ్చే పాలసీని మేమెక్కడా చూడలేదని అందరూ ప్రశంసించారు. 2026లో కూడా ఆనాడు కేటీఆర్, కేసీఆర్ చేసిన పాలసీల గురించి నీతి ఆయోగ్ మాట్లాడుతుందంటే మనవి ఎంత బ్రహ్మాండమైన పాలసీలో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు.
ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏ రోజుకూడా తెలంగాణ మూడవ స్థానం నుండి కిందికి దిగలేదన్నారు. కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన టీఎస్-ఐపాస్ పాలసీ బ్రహ్మాండమైన పాలసీ అని ఇప్పటికీ నీతి ఆయోగ్ పొగుడుతుంది. అలాంటి పాలసీని పెట్టుకొని కూడా మనం 13వ స్థానానికి పడిపోయామంటే రేవంత్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ర్యాంకింగ్లో తెలంగాణ 13వ స్థానానికి పడిపోయింది
కేసీఆర్ హయాంలో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే తెలంగాణ 1వ స్థానంలో ఉండేది
ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏ రోజుకూడా తెలంగాణ మూడవ స్థానం నుండి… pic.twitter.com/1IpPmSsSEj
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2026