Revanth Reddy | న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు. భారీ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 7వ తేదీన ఉదయం 10:28 గంటలకు సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది. అంతా టీమ్గా పని చేస్తారు అని కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఇక డిప్యూటీ సీఎంలు ఎవరనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Read More: తెలంగాణకు రెండో సీఎం రేవంత్.. ఆయన రాజకీయ ప్రస్థానం ఇదీ..
Congress President Shri @kharge has decided to go with Revanth Reddy as the new CLP of the Telangana Legislative Party.
The Congress will deliver a clean and able government that will provide maximum governance.
: Shri @kcvenugopalmp, General Secretary (Organisation) pic.twitter.com/njFUduUFsb
— Congress (@INCIndia) December 5, 2023