వికారాబాద్: జిల్లాలోని పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ఆకాశం మేఘావృతవడంతో జిల్లాలోని మఱిపల్లి, బంటారం, వికారాబాద్ టౌన్లో వానలు కూరిశాయి. చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. చల్లని గాలులు వీస్తుండటంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. హైదరాబాద్లో కూడా వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది.
మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..