కేవలం 15 నిమిషాలు అంతే. గాల్లో ఉండే కరోనా ఖతం. అదెలా అంటే ఇదిగో ఇక్కడ మీరుచూస్తున్న ఈ ఎలక్ట్రానిక్ వస్తువు వల్ల సాధ్యం. దీనిపేరు వోల్ఫ్ ఎయిర్ మాస్క్. ఇది చూడటానికి సీసీ కెమెరా కనిపిస్తుంది కానీ దీని పనితీరు మాత్రం భిన్నం. ఇది గాల్లోని కరోనాని చంపేస్తుంది. నాట్ ఓన్లీ కరోనా ఇతర బ్యాక్టీరియాలను కూడాచంపేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.
1000 square feet ఏరియాలో ఉన్నగాలిలోని వైరస్ ని కేవలం 15నిమిషాల్లోనే చంపేయడం దీని స్పెషాల్టీ. ఈ వస్తువు కంటిన్యూగా 60వేల గంటలు లేదంటే 9 ఏళ్లపాటూ పనిచేస్తుంది. కేరళకు చెందిన ఆల్ ఎబౌట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వోల్ఫ్ ఎయిర్ మాస్క్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇలాంటి టెక్నాలజీ వాడటం దేశంలోనే ఇదే తొలిసారి.
తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఈ వస్తువును టెస్ట్ చేసినట్లు కంపెనీ తెలిపింది. దీని భారత వైద్య పరిశోధనా మండలి కూడా (ICMR) గుర్తించింది. తద్వారా దీనికి గుర్తింపు ఉన్న టెస్టింగ్ ల్యాబ్గా పేరు ఉంది. ఆస్పత్రులు, ల్యాబులు, ఆఫీసులు, థియేటర్లు, ఇళ్లలో దీన్ని సెట్ చేసుకోవచ్చని కంపెనీ చెప్పింది.
జర్మనీ టెక్నాలజీతో తయారుచేసిన ఈ పరికరంలో లోపలి భాగాల్ని డెన్మార్క్ నుంచి తెప్పించారు. ప్రస్తుతం ఈ పరికరాన్ని ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో అమ్ముతున్నారు. వీటి ధర దాదాపు 20వేల నుంచి 30వేల వరకు ఉంది. కేరళలోని సినిమా థియేటర్లలో మాత్రమే కాదు కొన్ని కంపెనీలు కూడా ఈ వోల్ఫ్ ఎయిర్ మాస్క్ ని వాడుతున్నాయి.