వనపర్తి : వనపర్తి జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు ధర్శనమిస్తున్నాయి. రైతుల ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ యాడ్ తో పాటు కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో తన మొండివైఖరిని విడనాడాలని రైతులు కోరుతున్నారు.
వనపర్తి మండలం రాజపేటలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు వనపర్తి – కొత్తకోట వెళ్లే రోడ్డుపై ధాన్యం పోసి నిప్పుపెట్టి తమ నిరనస తెలియజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు అవుతున్నా తూకం సక్రమంగా చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాజపేట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.