హైదరాబాద్ : బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ దవాఖానలు నేడు కనీస వసతులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. జనం సర్కార్ దవాఖానకు రావాలంటేనే జంకుతున్నారు. తాజాగా గద్వాలలోని గవర్నమెంట్ హాస్పిటల్లో సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో అధికారులు మృతదేహాలను ఆరుబయటే వదిలేశారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి(48) మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రాత్రి 8:40 గంటలకు పోలీసులు మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించగా, మార్చురీలో ఫ్రీజర్ పనిచేయడంలేదని, అధికారుల అనుమతి ఉంటేనే మార్చురీలోకి మృతదేహాన్ని తీసుకెళ్తామని దవాఖాన సిబ్బంది చెప్పారు. చేసేదేమీ లేక దాదాపు రెండు గంటల పాటు వేచి చూసి మృతదేహాన్ని పోలీసులు మార్చురీ బయటే వదిలేసి వెళ్లారు.
అయితే మార్చురీలో గత కొద్ది రోజులుగా ఫ్రీజర్లు పనిచేయడంలేదని, బయట మార్కెట్ నుండి ఫ్రీజర్ తెప్పించి మృతదేహాని భద్రపరుస్తున్నామని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఝాన్సీలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ దవాకానలో కనీసం మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ కూడా పనిచేయకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు
మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో, మృతదేహాలను ఆరుబయటే వదిలేసిన అధికారులు
గద్వాల జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి(48) మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
దీంతో రాత్రి 8:40 గంటలకు… pic.twitter.com/8Lmt4vXWZb
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026