హైదరాబాద్ : కరోనా సమయంలో లాక్డౌన్ ముగిసేవరకు గుడికి వెళ్లటానికి ప్రత్యామ్నాయంగా ఆన్లైన్లో అర్చన, పూజ సేవలను ఊపయోగించుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కోరారు. భక్తుల కోసం దేవాదాయ శాఖ ఆలయాల్లో ఆన్ లైన్ లో ఆర్జిత సేవలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని 38 ప్రముఖ దేవాలయాలలో ఆన్లైన్ పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించామని వివరించారు.
Tapp Folio మొబైల్ యాప్, https://ts.meeseva.telangana.gov.in/meeseva/home.htm మీ సేవ పోర్టల్లో ఆన్లైన్ పూజలను బుక్ చేసుకోవాలని సూచించారు.
ఆన్ లైన్ పూజలు నిర్వహించే ఆలయాల జాబితాలో 38 ప్రధాన ఆలయాలు ఉన్నాయని, వాటిలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు హనుమాన్ దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతోపాటు పలు దేవాలయాల్లో ఆన్ లైన్ పూజలు జరిపిస్తున్నామని పేర్కొన్నారు.
ఆలయానికి నేరుగా వెళ్లి దర్శనం చేసుకోలేని భక్తుల సౌకర్యార్థ్యం ఆన్ లైన్లో అర్చనలు, పూజలు చేయించుకునే అవకాశం కల్పించామన్నారు. లాక్డౌన్ సమయంలో ఈ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి