జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాల్క సుమన్ తండ్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేష్ (60) అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం సుమన్ స్వగ్రామం రేగుంట (మెట్ పల్లి) లో సురేష్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మంత్రి మల్లా రెడ్డి కూడా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ తదితరులు ఉన్నారు.