వరంగల్ అర్బన్ : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పాలన అందించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా గుండు సుధారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరై మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు చారిత్రాత్మక నగరమైన ఓరుగల్లును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారు.
దానిని నిలబెట్టుకోవాలన్నారు. సీఎంకు వరంగల్ మీద ఎనలేని ప్రేమ. సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి వరంగల్కు రీజనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తామనడం ఆయన నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. వరంగల్ నగరం మేధావులు, విద్యావంతులది.
ఈ నగర పేరు ప్రఖ్యాతలు మరింత ఉన్నతంగా పెంచేలా సేవలందించాలని మంత్రి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఏ లక్ష్యంతో టీఆర్ఎస్ను గెలిపించారో..ఆ లక్ష్యం నెరవేరే విధంగా కొత్త పాలకవర్గం పని చేయాలన్నారు.
ఇందుకోసం మేము కూడా సంపూర్ణంగా సహకరిస్తాం. ఇచ్చిన హమీలకంటే ఎక్కువగా ఈ వరంగల్కు నిధులు వచ్చేలా కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి