హైదరాబాద్ : ఉత్తమ డీసీసీబీ చైర్మన్గా చిట్టి దేవేందర్ రెడ్డి జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని డీసీసీబీలో కెల్లా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మెరుగైన పనితీరుతో ఉత్తమడీసీసీబీ చైర్మన్గా చిట్టి దేవేందర్ రెడ్డికి ఈ అవార్డు దక్కింది.
గురువారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ చేతుల మీదుగా చిట్టి దేవేందర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు సీఈవో శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ మెదక్ డీసీసీబీ పనితీరు పట్ల అభినందనలు వ్యక్తం చేశారు.
కేవలం మూడు సంవత్సరాల కాలంలో ఒక లక్షా 60 వేల మంది రైతులకు ఆర్థికపరమైన సేవలను అందించడంతో పాటు బ్యాంకు లావాదేవీలను రూ.450 కోట్ల నుంచి 1650 కోట్ల వరకు విస్తరించేలా కృషిచేసిన చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డిని బ్యాంకు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
డీసీసీబీచైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు అందించిన ప్రోత్సాహంతో దేశంలోనే ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించగలిగామని అన్నారు.
భవిష్యత్తులో కార్పొరేట్ బ్యాంకుల కు దీటుగా డీసీసీబీ బ్యాంకు ద్వారా రైతులకు సేవలను అందిస్తామని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో అవార్డు రావడం వెనక ప్రతి ఒక్క సిబ్బంది పట్టుదల ఉన్నాయని అన్నారు. జాతీయస్థాయి అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | ఆ సొమ్మును అల్లుడే కాజేశాడట..
ట్రైనీ నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించిన సూపరింటెండెంట్కు దేహశుద్ధి
Yadadri Temple | యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు