నారాయణఖేడ్ : ట్రెనింగ్ నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించిన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహన్ను గురువారం బాధితురాలి కుటుంబ సభ్యులు దవాఖాన ఆవరణలో దేహశుద్ధి చేశారు.
స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సై వెంకట్ రెడ్డి వివరాలను వెల్లడించారు. నారాయణఖేడ్ ఏరియా దవాఖానలో ట్రెనింగ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న మహిళను డిసెంబర్ 1న సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహన్ తన ఛాంబర్ కు తీసుకెళ్లి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు. నేను వరుసకు నీకు బావ అవుతానని చెంపలపై చేయివేసి అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ట్రెనింగ్ నర్సు కుటుంబసభ్యులు, బంధువులు ఆటోల్ వచ్చి సుమారు 15 మంది దాడి చేశారని సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | ఆ సొమ్మును అల్లుడే కాజేశాడట..
గుజరాత్ తీరంలో గల్లంతైన 15 మత్సకారుల పడవలు
Yadadri Temple | యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు