ములుగు : హరితహారంతో ములుగు జిల్లాకు పూర్వవైభవం రావాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం, పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. జిల్లా దట్టమైన అడవులతో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. కానీ అనేక కారణాల వల్ల నేడు అడవులు అదృశ్యం అయ్యాయని తెలిపారు. అయితే రాష్ట్రంలో తరిగి పోయిన అడవులను మళ్లీ పెంచుకోవడానికి సీఎం కేసీఆర్ దేశంలో ఏ నాయకుడు చేయని ప్రయత్నం హరితహారం ద్వారా చేస్తున్నారని ప్రశంసించారు.
పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో భావితరాలకు తరగని ఆస్తిగా పచ్చని పర్యావరణాన్ని అందించే లక్ష్యంతో సీఎం హరితహారం చేపట్టారన్నారు. ఇందులో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వడం నుంచి అడవుల్లోని ఖాళీ ప్రదేశాల్లో కూడా మొక్కలను పెంచే లక్ష్యం నిర్ధేశించారన్నారు.
రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు, గ్రామపంచాయతీ లోని అంతర్గత రోడ్ల లో కూడా మొక్కలు నాటివ వాటిని సంరక్షించాలన్నారు. ఈ 10 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికలో పనులను మనసుపెట్టి చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుతాయని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేనందున పల్లె ప్రగతి పనులు సక్రమంగా జరిగేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.
మంత్రిగా తాను, ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కలిసి ఎప్పుడైనా ఆకస్మికంగా వచ్చి పల్లె ప్రగతి పనులు తనిఖీ చేస్తామన్నారు. పనులు బాగుంటే అభినందించి అవార్డులు ఇస్తాం. బాగా చేయకపోతే వెంటనే చర్యలు తీసుకుంటామని, అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
పల్లె ప్రగతి నిరంతరం కొనసాగాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి
వరంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : మంత్రి ఎర్రబెల్లి