నిర్మల్ : అధికారులు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. జూలై 1 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై మంత్రి జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలలో పెంపకం, నాటిన మొక్కల సంరక్షణ, వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, తదితర అంశాలపై అధికారులకు మంత్రి దిశానిర్ధేశం చేశారు.
సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వీటిని విజయవంతానికి తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… నూతన పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ చట్టాలను అమల్లోకి తెచ్చి పల్లెలు, పట్టణాల అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రతినెలా గ్రామాల అభివృద్ధికోసం, రూ. 339 కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.148 కోట్లను విడుదల చేస్తున్నారని తెలిపారు. పెండింగ్ పనులపై దృష్టి పెట్టి ఇకనైనా వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
శ్మశానవాటికలు, డంప్యార్డులు, నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలను శుభ్రం చేయించాలన్నారు. సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ కే.విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్,కలెక్టర్ ముష్రాఫ్ అలీ ఫారూఖీ, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత