మెదక్: జిల్లాలోని శివంపేట తహసీల్దార్పై ఆందోళన కారులు డీజిల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన రైతు మాలోత్ బాబు (28) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.కాగా, అతని పేరుపై ఉన్న భూమి పార్టీ- బీ లో పెట్టి పాస్ బుక్ ఇవ్వలేదు. అతను చనిపోవడంతో రైతుబంధు రాదని తెలిసి తాళ్లపల్లి తండా గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు.
తహసీల్దార్ కార్యాలయానికి బాబు మృతదేహంతో చేరుకొని ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ భానుప్రకాష్పై, కార్యాలయంలో డీజిల్ పోసి నిప్పు అంటించేందుకు ప్రయత్నించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.