రంగారెడ్డి : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె, పట్టణ ప్రగతి ద్వారా ఊహించని మార్పు వచ్చిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జులై 1 వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమ సన్నాహకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మేయర్ లు, ఎంపీపీ, జడ్పీటీసీలు, చైర్మన్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం అన్నారు. ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
పల్లె ప్రగతి ద్వారా ప్రతి నెల రాష్ట్రంలో రూ.308 కోట్లు, పట్టణ ప్రగతి ద్వారా రూ.150 కోట్లు నేరుగా గ్రామాలకు, మున్సిపాలిటీలకు నిధులు అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి నెల రూ.12 కోట్ల 38 లక్షలు, పట్టణ ప్రగతిలో భాగంగా రూ.5 కోట్ల 60 లక్షల నిధుల విడుదల చేశామని పేర్కొన్నారు.
గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో లలో పచ్చదనం, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కన, పాఠశాలలు, దవాఖానలు, కార్యాలయాల వద్ద మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఇంటికి మొక్కలు ఇవ్వాలి. గత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించాలి. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య