నర్మెట డిసెంబర్ 07 : అంగన్వాడీ టీచర్లను గుర్తించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామ జిల్లా నర్మెట మండలంని హనుమంతా పూర్ గ్రామంలో నర్మెట, తరిగొప్పల మండలాల అంగన్వాడీ టీచర్లకు 4జీ ఫోన్లను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు అంగన్వాడీలను విస్మరించాయన్నారు.
కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి సరైన గుర్తింపునిచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హరిత, జెడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్, నర్మెట, తరిగొప్పుల టీఆర్ఎస్ మండల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేష్, పింగిలి జగన్మోహన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
డయల్ 100తో తక్షణ స్పందన..బాలుడిని తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
Tiger attack | జయశంకర్ జిల్లాలో బర్రెల మందపై పులి దాడి..భయాందోళనలో గ్రామస్తులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు