మంచిర్యాల, డిసెంబరు 6 : ఫ్రెండ్లీ పోలీసింగ్తో రాష్ట్ర పోలీసులు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటున్నారు. డయల్ 100కు ఫోన్కు చేయగానే తక్షణమే స్పందించి చేయూతనందిస్తున్నారు. కాగా, ఓ బాలుడు తప్పిపోవడంతో తల్లి డయల్ 100కు ఫోన్ చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు బిడ్డను వెతికిపట్టి తల్లి ఒడికి చేర్చారు. ఈ సంఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..మంచిర్యాల ప్రభుత్వ దవాఖాననలో చికిత్స పొందుతున్న చెల్లెలిని పరామర్శించేదుకు ఓ తల్లి తన ఏడేండ్ల కొడుకుతో కలిసి వెళ్లింది. అప్పటి వరకు అక్కడే ఆడుకుంటున్న కుమారుడు కనిపించక పోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. కంగారుపడి డయల్ 100 కి కాల్ చేశారు.
దీంతో మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నారాయణ నాయక్ బ్లూ క్లోట్స్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఔట్ పోస్ట్ పీసీ శ్రీధర్తో పీసీలు ఉస్మాన్, తిరుపతి కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా బాబు మెయిన్ రోడ్ వైపు నడుచుకుంటూ వెళ్లడం గమనించారు.
బాబును తీసుకొని వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. సకాలంలో స్పందించి బాబును అప్పగించినందుకు పోలీస్ అధికారులు, సిబ్బందికి బాబు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Tiger attack | జయశంకర్ జిల్లాలో బర్రెల మందపై పులి దాడి..భయాందోళనలో గ్రామస్తులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు