ములుగు : జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామ శివాలయంలో చోరీ జరిగింది. సోమవారం రాత్రి ఆలయ తాళాలను పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. 2 వెండి కిరీటాలు, ఒక నాగాభరణం దుండగులు ఎత్తుకెళ్లిన్నట్లుగుర్తించిన ఆలయ పూజారి మంగపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న మంగపేట పోలీసులు తెలిపారు.