వరంగల్ రూరల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జిల్లాలోని నర్సంపేట పట్టణ సమీపంలో నున్న మాదన్నపేట చెరువును అయన శుక్రవారం సందర్శించి వరద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షం వల్ల నష్టం జరుగకుండా ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తగు సూచనలు చేశామన్నారు.
భారీ వర్షాలు పడుతున్నందున చేపలు పట్టడానికి జాలర్లు, ప్రజలు చెరువుల్లోకి, వాగుల్లోకి వెళ్లొద్దని మంత్రి సూచించారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, తదితర అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ