ములుగు : గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటం, ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి 9,50,900 లక్షల క్యూసెక్కుల ఇంఫ్లో ఉండగా.. అంతే మొత్తంలో (మొత్తంగేట్లు) 59 గేట్లను ఎత్తి దిగువకు పంపిస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.