ములుగు : జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామం వద్ద ఉన్న లక్నవరం సరస్సు మత్తడి పోస్తున్నది. కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో లక్నవరం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని మత్తడి పడుతున్నది. నిండుకుండలా మారిని లక్నవరం అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.