ములుగు : తెలంగాణ నయాగారగా పిలువబడే బోగత జలపాతం సందర్శనను అధికారులు మూసి వేశారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా సందర్శకుల అనుమతిని నిలిపి వేశామని అటవీశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక యథావిథిగా పర్యాటకులను అనుమతిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ