కామారెడ్డి : సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లాలోని గాంధారి మండల కేంద్రంలో 9.20 కోట్లతో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటీల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. గాంధారి మండల ప్రజల చిరకాల వాంఛ అయిన డబుల్ రోడ్డుతో పాటు, సెంట్రల్ లైటింగ్ కల త్వరలోనే సాకారం కానున్నదని.. రోడ్డు విస్తరణ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని ఆర్ఆండ్బీ అధికారులను ఆదేశించారు.
పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతి గ్రామం అభివృద్ధి దిశలో పయనిస్తున్నదన్నారు. గతంలో గ్రామ పంచాయతీలకు సంవత్సరానికి రూ.20 లక్షల నిధులు వస్తే, ప్రస్తుతం సంవత్సరానికి కోటి రూపాయల నిధులు వస్తున్నాయని తెలిపారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు.
రానున్న రోజుల్లో కాళేశ్వరం 22వ ప్యాకేజీ ద్వారా కొండెం చెరువు నుంచి నీటిని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు తీసుకువస్తామని అన్నారు. అంతకు ముందు ఆయన మండల కేంద్రంలో హరితహారం భాగంగా మొక్కను నాటి నీళ్లు పోశారు.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం