చేర్యాల/సిద్దిపేట : చేర్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నూతనంగా నిర్మించిన టాయిలెట్స్( సులబ్ కాంప్లెక్స్) నిరుపయోగంగా ఉన్న విషయాన్ని తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సోమవారం దానిని వినియోగంలోకి తీసుకువచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే నేరుగా సులబ్ కాంప్లెక్స్ వద్దకు వెళ్లి దానికున్న తాళం పగులగొట్టించారు. అనంతరం చీపురు, నీళ్లు తెప్పించి సులబ్ కాంప్లెక్స్ ఆవరణ మొత్తాన్ని ఎమ్మెల్యే స్వయంగా ఊడ్చారు.
అలాగే కాంప్లెక్స్ లోపలి భాగంలో ఉన్న వాష్బేసిన్ పై మగ్గుతో నీళ్లు పోసి తన చేతులతో కడిగి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం సులబ్ కాంప్లెక్స్ బయట ఉన్న నాయకులు, కార్యకర్తలతో కలిసి చెత్తను తొలగించారు. ఎమ్మెల్యే పనితీరును చూసిన స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం