హైదరాబాద్: సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. నగరంలోని ముషీరాబాద్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని అన్నారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
పేదలు ఆత్మ గౌరవంతో బతకడానికే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టించి ఇస్తున్నారని మంత్రి మహమూద్ అలీ అన్నారు. కరోనా సంక్షోభంలోనూ రైతు బంధు, రైతు బీమా చెల్లిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా సాయిచరణ్ కాలనీలో మొక్కలు నాటారు. డబుల్ బెడ్ రూం పథకంలో భాగంగా ముషీరాబాద్లోని సాయిచరణ్ కాలనీలో 108, టీ. అంజయ్య నగర్లో 35 ఇండ్లను నిర్మించారు.