వరంగల్ అర్బన్ : కొవిడ్ మహమ్మారి వల్ల అనేక మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతున్నారని, ఎంతోమంది నిరాశ్రయులు అవుతున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా అర్బన్ ప్రాజెక్ట్, దీన్ దయాళ్ నగర్ అంగన్ వాడీ కేంద్రంలో అంగన్ వాడీ టీచర్గా పనిచేస్తున్న జి. వనిత ఈ ఏడాది జనవరి 24వ తేదీన కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం దురదృష్టకరమన్నారు.
అప్పటికే భర్త లేని వనిత కూడా కొవిడ్ నేపథ్యంలో చనిపోవడంతో ఏడో తరగతి చదువుతున్న ఆమె కూతురు సిరి ప్రియ తల్లిదండ్రులు లేని బిడ్డగా మారిందన్నారు. దీంతో ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో భాగంగా రెండు లక్షల రూపాయల చెక్ను కుమారి సిరిప్రియకు అందించామన్నారు. ప్రభుత్వ ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆలయాల్లో ఆన్లైన్ ఆర్జిత సేవలు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి