హైదరాబాద్ : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2020 తుది పరీక్ష ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 83వ రాంక్ సాధించిన మేఘనను మంత్రి కేటీఆర్ సన్మానించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి చెందిన టీఎస్ఎస్పీడీసీఎల్ (TSSPDCL ) డైరెక్టర్ కమర్షియల్ కె. రాములు కుమార్తె అయిన కావలి మేఘన ప్రగతి భవన్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మేఘనను సత్కరించి జీవితంలో మరింత ఉన్న స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వివాహితతో ఎస్ఐ రాసలీలలు..రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
భూ వివాదంతో దళిత కుటుంబం హత్య.. బాలికపై సామూహిక లైంగికదాడి
40 రోజుల పసికందును చంపిన అత్యాచార బాధితురాలు