బ్రసెల్స్ : దక్షిణాఫ్రికాలో తాజాగా B.1.1.529. కరోనా వేరియంట్ను గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కరోనా వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై జర్మనీ, ఇటలీ దేశాలు నిషేధం విధించాయి. బ్రిటన్ కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
B.1.1.529. కరోనా వేరియంట్ కలవరపెడుతున్న నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై నిషేధం విధించినట్లు యూరోపియన్ యూనియన్ దేశాల చీఫ్ ఉర్సులా వండర్ లియోన్ శుక్రవారం ట్వీట్ చేశారు. జర్మనీలో ఇవాళ రాత్రి నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కేవలం జర్మన్ దేశస్తులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, వారు కూడా తప్పకుండా 14 రోజుల పాటు క్వారంటైన్ పాటించాలని ఆదేశించింది. దక్షిణాఫ్రికా, లిసోథో, బోత్సవానా, జింబాబ్వే, మోజంబిక్, నమీబియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై రోమ్ నేటి నుంచి నిషేధం విధించింది.
దక్షిణాఫ్రికాలో తాజాగా గుర్తించిన B.1.1.529. కరోనా వేరియంట్లో అత్యధిక స్థాయిలో మ్యుటేషన్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆ మ్యుటేషన్ల వల్ల ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.