రంగారెడ్డి : గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలో పి.ఎం.జి.ఎస్ వై కింద షాబాద్ నుంచి పాలమాకులకు, నేషనల్ హైవే 44 నుంచి నౌకుడకు, నేషనల్ హైవే 44 నుంచి శంకురపురంకు, కాచరం నుంచి జుకల్కు12 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నాలుగు తారు రోడ్డు నిర్మాణ పనులకు, 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి ఆయన మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమం అమలుతో గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం కోడందుర్గు మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనానికి , తుమ్మల్కపల్లిలో 3 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రులు ప్రారంభించారు.
అనంతరం చింత కుంట తండాలో 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని మంత్రులు ప్రారంభించారు. కొడందుర్గ్ మండలంలోని గుంజల్ పహాడ్ గ్రామంలో 3 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఫరుక్ నగర్ మండలంలోని హజేపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అనిత, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నిర్మల్ వర్ష ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా
ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్రావు