నిర్మల్ : ఎడతెరిపి లేని వర్షాలతో నిర్మల్ పట్టణం జలమయమైంది. కాగా, వరద ప్రాంతాల్లో పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. జిల్లా మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మరో 24 గంటల పాటు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలన్నారు. సహాయక చర్యలు చేపట్టడానికి నిర్మల్కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్రావు