వికారాబాద్ : ఇసుక ట్రాక్టర్ బైక్ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని పెద్దేముల్ మండలం కందనెల్లి తండా గ్రామ సమీపంలో గల వై జంక్షన్ లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఇందూర్ గ్రామానికి చెందిన జెల్ల లక్ష్మప్ప (55) ఇందూర్ నుంచి తాండూర్ వైపు బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో తాండూర్ నుంచి పెద్దేముల్ వైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్ బైక్ను ఢీ కొట్టడంతో జెల్లప్ప అక్కడికక్కడే మృతి చెందాడు.