న్యూఢిల్లీ: చమురు ఎగుమతి దేశాలు.. ఐక్యత, బలమైన బంధానికి మారుపేరుగా నిలిచేవి. సంక్షోభాలను అధిగమించడంలో ఏక తాటిపై నిలిచేవి.తాజాగా చమురు ఉత్పత్తి, నిబంధనల అమలు విషయమై చమురు ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్)లో విభేదాలు బహిర్గతం అయ్యాయి. చమురు ఉత్పత్తి పెంపుపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తాయి.
దీంతో వచ్చే నెలలో వివిధ దేశాలకు చమురు ఎగుమతులపై ప్రతిష్టంభన నెలకొంది. ఇరు దేశాలూ ఒక సయోధ్యకు రాకపోతే మాత్రం వచ్చే నెలలో చమురు ధరల సంక్షోభం రావొచ్చునని భావిస్తున్నారు.ఆగస్టుతోపాటు ఈ ఏడాది చివరి వరకు ఎంత చమురు ఉత్పత్తి చేయాలన్న అంశంపై ఒపెక్తోపాటు రష్యా ఇతర చమురు ఎగుమతి దేశాలు రెండు మార్లు సమావేశమయ్యాయి. కానీ, కూటమిలో ప్రధాన సభ్య దేశాలు యూఏఈ, సౌదీ మధ్య సయోధ్య కుదర లేదు. దీంతో ఒపెక్ ప్లస్ సమావేశాలు వాయిదా పడ్డాయి.
వచ్చే నెలలో మరో 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి పెంచాలని సౌదీ అరేబియా ప్రతిపాదన. ఇంతకుముందు నిర్ణయించినట్లు 2022లోనూ ఉత్పత్తిపై ఆంక్షలు కొనసాగించాలని తెలిపింది. సౌదీ అరేబియా నిర్ణయాన్ని రష్యా సహా కూటమిలోని ఇతర దేశాలూ అంగీకరించాయి.
ఈ రెండు ప్రతిపాదనల్లో వచ్చే నెల నుంచి చమురు ఉత్పత్తిని పెంచడానికి యూఏఈ అంగీకరించింది. కానీ, ఉత్పత్తిపై ఆంక్షల గడువు పొడిగింపునకు మాత్రం ససేమిరా అంటున్నది.
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకు డిమాండ్ పెరుగుతున్నది. దీని అదునుగా లాభాలను ఒడిసిపట్టాలని సౌదీ భావిస్తున్నది. యూఏఈ మాత్రం అందుకు భిన్నంగా దిగుమతి దేశాల అవసరాలను బట్టి వాటితో మెరుగైన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సభ్య దేశాలకు అవకాశమివ్వాలని కోరుతున్నది.
ముడి చమురు ఉత్పత్తిపై ఆంక్షలను విధించే విషయమై యూఏఈ అంగీకారం లేకుండా నిర్ణయం తీసుకోలేమని సౌదీ అంగీకరిస్తున్నది. కానీ, ఉత్పత్తిపై ఆంక్షలు కొనసాగించాలన్న విషయమై వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పింది.
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఆగస్టులో ముడి చమురు ఎగుమతులపై సందిగ్ధత నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే.. ఇప్పటికే భారీగా పెరిగిన చమురు ధరలు ఆగస్టులో మరింత పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.
ఒపెక్, కూటమిలోని ఇతర దేశాలు ఎంత చమురు ఉత్పత్తి చేయాలన్నదాన్ని ‘బేస్లైన్’ అనే పారామీటర్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఆంక్షలు, బేస్లైన్ను పరిగణనలోకి తీసుకొని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. 3.2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తున్నది.
కానీ, తమ అవసరాలకనుగుణంగా దీన్ని 3.8 మిలియన్ బ్యారెళ్లకు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని యూఏఈ కోరుతున్నది. కానీ, ఓపెక్ దేశాలు ఇందుకు అంగీకరించడం లేదు.యూఏఈ, సౌదీ మధ్య సంక్షోభం ఇలాగే కొనసాగితే, ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే జరిగితే, మరో అంతర్జాతీయ చమురు సంక్షోభం ముంచుకు రావచ్చునని విమర్శలు ఉన్నాయి. బ్యారెల్ క్రూడ్ ధర మున్ముందు 75 డాలర్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమ వైఖరి వల్ల ఒపెక్ ప్లస్ కూటమిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏకాకి అయ్యిందని ఎమిరేట్స్ పాలకుడు అబ్దుల్ అజీజ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై తమ ఆమోదం లేకుండా సౌదీ అరేబియా ముందుకెళ్లలేదని పేర్కొన్నారు.
ఇతర దేశాలకు అందుబాటులో కోవిన్ పోర్టల్: ప్రధాని మోదీ
స్పీకర్పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. 12 మందిపై ఏడాది వేటు
హక్కుల నేత స్టాన్ స్వామి మృతి
జమ్మూ వైమానిక స్థావరంపై ఆర్డీఎక్స్, నైట్రేట్తో డ్రోన్ల దాడి
రూ.37 లక్షల బైక్.. 24 గంటల్లోనే బుకింగ్స్ క్లోజ్
అమెజాన్ సీఈవో పదవికి బెజోస్ గుడ్బై.. ఎందుకు? ఆయన భవిష్యత్తు ఏంటి?
వ్యక్తిగత జీవితంపై వర్క్ ఫ్రం హోం ప్రభావం
ఏటీఎం కార్డు లేకుండా డబ్బు విత్డ్రా చేయాలా?
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
మన దగ్గరేమో వానలు.. ఢిల్లీ , అమెరికాలో భానుడి భగభగ.. కారణమేంది?
హైదరాబాద్లో బంగారం ధర రూ.44,300..!
అమెజాన్ హిట్ బిగ్ మిస్టేట్.. రూ.5,900లకే రూ.లక్షవిలువైన ఏసీ