హైదరాబాద్, ఏప్రిల్ 23: ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ హిటాచీ ఎనర్జీ..హైదరాబాద్లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో నూగూరి వేణు తెలిపారు.
సంస్థను ప్రారంభించి 75 ఏండ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..భారత్లో వ్యాపార విస్తరణ కోసం 2019 నుంచి ప్రతియేటా వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు, వీటితో గత నాలుగేండ్లలో మూడు ఫ్యాక్టరీలను నిర్మించినట్లు చెప్పారు. అలాగే వరంగల్లో ల్యాబ్ను నెలకొల్పే ఆలోచనలో సంస్థ ఉన్నదన్నారు.