వికారాబాద్ : సమాజ విలువలతో కూడుకొని మార్పు కోరే చిత్రాలు తీయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ధారూర్ మండలం నాగసముందర్ గ్రామంలో వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం మెట్లకుంట గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి పీఏ నాయుడు నిర్మించిన కఠారి కృష్ణ సినిమా బ్యానర్ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సినిమా రంగంలోకి మన జిల్లా వాసి వెళ్లడం సంతోషకరమన్నారు. ఈ నెల 10న విడుదలవుతున్న సినిమాను ప్రజలు ఆదరించి విజయవంతం చేయాలన్నారు. ఈ సినిమా విజయవంతమై నాయుడు మరెన్నో పెద్ద చిత్రాలు నిర్మించాలని ఆయన ఆకాంక్షిచారు.
కార్యక్రమంలో అశోక్ గౌడ్, కృష్ణ, సప్తగిరి గౌడ్, రాజు గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు సంఘాల కమిటీకి సర్కార్ తాజా ప్రతిపాదన : నిర్ధిష్ట హామీలకు ఎస్కేఎం పట్టు
Nallagonda | సంతోషిమాత ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
Mulugu | ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్