హైదరాబాద్ : బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. వేడుకలకు హాజరు కాలేదంటూ బెల్లింపల్లి మున్సిపల్ కార్యాలయంలోని ముగ్గురి సిబ్బందికి కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టి రాగా స్పందించారు. కమిషనర్ తీరుపై విచారం వ్యక్తం చేస్తూ.. సస్పెండ్ చేయాలని మంత్రి సీడీఎంను ఆదేశించారు. ఇలాంటి అభిమానాన్ని ప్రోత్సహించడంలో తాను చివరి వ్యక్తిననంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
I am the last person to encourage sycophancy in politics or administration
Read about an over enthusiastic Municipal commissioner issuing a memo to subordinates for not attending my birthday celebrations!🤦♂️
Have asked @cdmatelangana to suspend the MC for his absurd behaviour
— KTR (@KTRTRS) July 29, 2022