Congress | కోల్కతా, మే 19: లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించడంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి మధ్య విభేదాలు తలెత్తాయి. మమత మద్దతు తీసుకోవాలా వద్దా అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, అధీర్ కాదని ఖర్గే వ్యాఖ్యానించారు.
దీనిపై అధీర్ స్పందిస్తూ.. మమత అవకాశవాద రాజకీయ నాయకురాలని.. రాష్ట్రంలో కాంగ్రెస్ను అంతం చేయడమే ఆమె లక్ష్యమని అన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కోల్కతాలో పలుచోట్ల ఖర్గే పోస్టర్లపై గుర్తు తెలియని వ్యక్తులు ఇంకు చల్లి.. ‘ఖర్గే తృణమూల్ ఏజెంట్’ అని రాశారు. ఈ ఘటనను అధీర్ ఖండించారు.