Driving Licence | న్యూఢిల్లీ, మే 19: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక నుంచి ఆర్టీఓ కార్యాలయానికి డ్రైవింగ్ టెస్ట్కు హాజరుకావాల్సిన అవసరం లేదు. ప్రైవేటు సంస్థలు కూడా డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లను జారీ చేయవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. జూన్ 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.
ఫోర్ వీలర్ పరీక్ష నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్కు కచ్చితంగా 3 ఎకరాల స్థలం ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉండాలి. ట్రైనర్లు కచ్చితంగా హైస్కూల్ విద్యను పూర్తి చేసుకొని, డ్రైవింగ్లో ఐదేండ్లు అనుభవం పొంది ఉండాలి. వీరికి బయోమెట్రిక్స్, ఐటీపై ప్రాథమిక అవగాహన ఉండాలి. నిబంధనల ప్రకారం ఈ అన్ని అర్హతలు ఉన్న ప్రైవేటు సంస్థలకు డ్రైవింగ్ టెస్టు చేసే అధికారాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.
డ్రైవింగ్ నేర్పించేందుకు కాలపరిమితికి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. లైట్ వెహికిల్ ట్రైనింగ్ను కచ్చితంగా నాలుగు వారాల పాటు, కనీసం 29 గంటల పాటు శిక్షణ ఇవ్వాలి. ఇందులో ఎనిమిది గంటలు థియరీ, 21 గంటలు ప్రాక్టికల్ ఉంటుంది. హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్కు ఆరు వారాల పాటు కనీసం 39 గంటల ట్రెయినింగ్ ఇవ్వాలి. ఎనిమిది గంటలు థియరీ, 31 గంటలు ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది.