సిద్దిపేట : మహిళలు స్వయం ఉపాధి పొంది అందరికీ ఆదర్శంగా నిలుస్తూ.. ఆత్మ విశ్వాసంతో ఎదిగి మీ కుటుంబాన్ని కూడా ఆదర్శంగా నిలపాలన్నదే నా కోరికని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సుడా కార్యాలయంలో అంజయ్య మెమోరియల్ సహకారంతో ఇర్కోడు, తోర్నాల గ్రామ మహిళలకు రూ.18 లక్షల వ్యయంతో 62 కుట్టు మిషన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కుట్టు మిషన్లను అందించడంతో పాటుగా కమర్షియల్ ఆర్డర్లు వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
ఒక్కో కుట్టు మిషన్ ధర రూ.28 వేల విలువ ఉంటుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఆటోమైజ్ కుట్టు మిషన్ పై అన్ని రకాల కుట్లు వేసుకోవచ్చని తెలిపారు. ప్రేమతో, ఆప్యాయతతో ప్రముఖ సామాజిక కార్యకర్త చందర్రావు, అంజయ్య మెమోరియల్ బాద్యులు అర్జున్గౌడ్, రాజేశ్వర్ వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ కుట్టు మిషన్లు అందించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, సిద్దిపేట రూరల్ వైస్ ఎంపీపీ శేరిపల్లి యాదగిరి, తోర్నాల సర్పంచ్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : సంప్లో పడి వ్యక్తి మృతి
హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరు
రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దే
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
సీఎం కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన