Summer | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా భగభగలాడుతున్న ఎండలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 28వ తేదీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టంచేసింది. మధ్యాహ్నం నిప్పుల ఎండలు, రాత్రి వేడిగాలులు ఉంటాయని హెచ్చరించింది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ, యానాంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీలు అదనంగా గరిష్ఠంగా 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరంలో లక్ష్మి (55) మంగళవారం ఉపాధి హామీ పనులు చేస్తూ వడదెబ్బకు గురై అకడికకడే మృతి చెందింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)మండలం కోటినాయక్తండాకు చెందిన ధరావత్ గోల్యా (70), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బాలరాజ్పల్లిలో నాగుల బా లయ్య (50) అనే రైతు వడదెబ్బతో మరణించారు.