మధిర, జూలై 27 : ఆర్టీసీ కార్మికుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని, సమ్మె సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీలో చర్చించి, అంగీకరించిన అంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్డబ్ల్యూఎఫ్) పిలుపు మేరకు మధిర డిపో ఎదుట కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు.
సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కోసం కమిటీని వెంటనే నియమించాలని, అలవెన్సులను 80 శాతం పెంచాలని, బ్రెడ్ విన్నర్ సీమ్లో నియామకమైన వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ పరీక్ష పాసైన వారికి వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని, డ్యూటీల పనిభారం తగ్గించి కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని వారు కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి జె.పద్మావతి, వరింగ్ ప్రెసిడెంట్ సురేశ్, అధ్యక్షుడు చందర్రావు, కార్యదర్శి కోటయ్య, నాగరాజు, బండి శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.