పాల్వంచ/ మణుగూరు టౌన్, జూలై 27 : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో యాష్, కోల్ ప్లాంట్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీపీఎస్లో ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు సోమవారం 29వ రోజుకు చేరాయి.
పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో, మణుగూరు బీటీపీఎస్ ప్రధాన గేటు ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పాల్వంచలో రాజేందర్, యాస్మిన్, ఉమామహేశ్వరరావు, బ్రహ్మజీ, మడకం శ్రీనివాసరావు, రాజేష్, తిరుపతి, అఖిల్, మధుబాబు, మహేశ్, మణుగూరులో రవిప్రసాద్, నరేశ్, మహేశ్, ప్రసాద్, వెంకట్రాం, కృష్ణ, శోభన్, వరుణ్ తదితరులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.