సంగారెడ్డి : ప్రమాదవశాత్తు సంప్లో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నారాయణఖేడ్ పట్టణంలో జరిగింది. ఎస్ఐ వెంకట్రెడ్డి కథనం ప్రకారం.. సిర్గాపూర్ మండలం వంగ్దాల్ తండాకు చెందిన రాథోడ్ లక్ష్మణ్(48) గురువారం పట్టణంలోని సాయిబాబ కాలనీలో తాను నిర్మిస్తున్న ఇంటికి వచ్చి రాత్రి ఇక్కడే ఉంటానని తన భార్య కమలాబాయికి ఫోన్ చేసి చెప్పాడు.
కాగా, బయటకు వెళ్లి వస్తానని తన ఇంటి వాచ్మెన్తో చెప్పి బయటకు వచ్చిన రాథోడ్ లక్ష్మణ్ కనిపించకుండా పోవడంతో.. శుక్రవారం ఉదయం అతని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని లక్ష్మణ్ కోసం గాలించగా నీటి సంప్లో అతడి మృతదేహం లభ్యమైంది. ఈమేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరు
రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దే
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
సీఎం కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన